మేడారం జాతరలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ప్రచారం పై జాతీయ మహిళా కమీషన్ సీరియప్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఎలాంటి అత్యాచారం జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని ఎంక్వయిరీ బృందం జాతీయ మహిళా కమిషన్కు అందించనుంది.
గత వారం మేడారం జాతర సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన రోజు జంపన్నవాగు సమీపంలో ఓ మైనర్ బాలికపై ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. అయితే జాతర అనంతరం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటుచేసిన జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తుకు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో భేటీ అయ్యారు. అనంతరం మేడారం జాతర పరిసరాలలో గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్న ప్రాంతం పరిశీంచారు. ఈ సందర్భంగా జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని జాతీయ మహిళా కమిషన్కు అందించనున్న ఎంక్వయిరీ బృందం తెలిపింది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




