మేడారం జాతరలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ప్రచారం పై జాతీయ మహిళా కమీషన్ సీరియప్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఎలాంటి అత్యాచారం జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని ఎంక్వయిరీ బృందం జాతీయ మహిళా కమిషన్కు అందించనుంది.
గత వారం మేడారం జాతర సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన రోజు జంపన్నవాగు సమీపంలో ఓ మైనర్ బాలికపై ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. అయితే జాతర అనంతరం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటుచేసిన జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తుకు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో భేటీ అయ్యారు. అనంతరం మేడారం జాతర పరిసరాలలో గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్న ప్రాంతం పరిశీంచారు. ఈ సందర్భంగా జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని జాతీయ మహిళా కమిషన్కు అందించనున్న ఎంక్వయిరీ బృందం తెలిపింది.
Also read
- పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
- కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
- కేపీహెచ్బీలో దారుణం.. మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
- లడ్డులో కల్తీ లేదని ఎక్కడుంది?
- మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే..





