హైదరాబాద్ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. టీ తాగుదామని కారులో తీసుకెళ్లి ఓ బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేవలం 72 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సహాధ్యాయి అని నమ్మి కారు ఎక్కిన ఒక బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి నమ్మకద్రోహానికి పాల్పడి, బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టిన ఘోర ఉదంతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అత్యంత వేగంగా స్పందించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఏరియాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బాధిత యువతి, ఉడతల ఉదయ్ అనే యువకుడు ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ఒకే క్లాస్ కావడంతో వీరిద్దరికీ గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మే 14వ తేదీ రాత్రి సమయంలో నిందితుడు ఉదయ్, ‘టీ తాగి వద్దాం’ అని నమ్మించి బాధితురాలిని ఆమె ఉంటున్న రూం వద్ద నుండి తన కారులో ఎక్కించుకున్నాడు.
అక్కడి నుండి దిల్ సుఖ్ నగర్ ఏరియా అంతా కారులో తిప్పిన నిందితుడు, తిరిగి ఇబ్రహీంపట్నం వైపు వస్తూ మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్ (BDL) రోడ్డు వైపు కారును తీసుకెళ్లి, అక్కడ బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించాడు. తను కూడా మద్యం సేవించిన అనంతరం, మత్తులో స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న యువతిని ఇబ్రహీంపట్నంలోని ఒక రూమ్కు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు మరుసటి రోజు (మే 15న) ధైర్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే స్పందించారు. సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితుడు ఉడతల ఉదయ్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





