మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల మోత మోగింది. స్థల వివాదంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ తర్వాత అనుచరులతో కలిసి స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు ప్రభాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల శబ్దం కాలనీవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
ఆ తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలం నుంచి బలవంతంగా బయటకు గెంటేసి.. గేటుకు తాళాలు వేశారు. ప్రభాకర్ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడరని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రభాకర్పై బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని లాక్కున్న ప్రభాకర్తో పాటు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





