సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
కోదాడ గ్రామీణం: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నగదు ఉన్న పెట్టె ఓపెన్ కాకపోవడంతో ఆశ వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అందులోని నగదు కాలిపోయింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసిన తర్వాత విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గ్రామీణ ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి