సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
కోదాడ గ్రామీణం: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నగదు ఉన్న పెట్టె ఓపెన్ కాకపోవడంతో ఆశ వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అందులోని నగదు కాలిపోయింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసిన తర్వాత విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గ్రామీణ ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





