ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే సీన్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రొద్దుటూరు నగరంలో ఉన్న టీ షాపు వద్దకు ఓ మున్సిపల్ అధికారి.. అతనితో పాటు మరో ఇద్దరు కాఫీ తాగడానికి వచ్చారు. అయితే వన్ బై త్రీ కాఫీని ఇవ్వాలని ఆ హోటల్ వారిని కోరారు.. అయితే.. వారు తమ దగ్గర ఇలాంటి పద్ధతి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ హోటల్లో ఉన్న సిబ్బందిపై కొద్దిసేపు వాదించిన అధికారి.. ఓ అరగంట తర్వాత జెసిబీతో ఆ హోటల్ ముందు ప్రత్యక్షమయ్యారు. హోటల్ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుందని, డ్రైనేజీ పై రాంప్ ఎందుకు కట్టారని హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. దానిని తొలగిస్తామని పేర్కొన్నారు. దీంతో అధికారి.. హోటల్ యమమాని మధ్య వాదన జరిగింది.
దీంతో చేసేదేమీ లేక ఆ హోటల్ యజమాని జేసీబీ ముందు పండుకొని నిరసన తెలిపారు. నా పైనుంచి ఎక్కించి ర్యాంప్ కూల్చాలని నిరసన తెలిపాడు.. నగరమంతా డ్రైనేజీ లపై ఈ విధంగానే ఉన్నాయని.. తాను ఒక్కడినే దానికి సమస్య కాదు.. అంటూ హోటల్ యజమాని అధికారులతో వాదించారు..
దీంతో చేసేదేమీ లేక ఆ మున్సిపల్ అధికారి వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రొద్దుటూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.. ఈనెల నాలుగవ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




