యర్రగొండపాలెం (ప్రకాశం) : యర్రగొండపాలెం పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు. ఆ పాఠశాలలో 600 మంది దాకా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా విద్యార్థులతో 600 చపాతీలను చేయించిన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే ఆదివారం కావడంతో వంటవారికి సాయం చేస్తున్నామని మరికొందరు అంటున్నారు. కాగా ఇలా విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
Also read :
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్