రక్షక భటులు యాక్షన్ సీన్ చూపించారు. బజారులో బరి తెగించారు. పోట్ల గిత్తల్లా కమ్మేసుకున్నారు. నడి రోడ్డుపై బలప్రదర్శకు దిగారు. ముష్టి యుద్ధంతో సినిమా చూపించారు. ముఖాలు వాచిపోయేలా పిడిగుద్దులతో విరుచుపడ్డారు. చివరకు అలసి పోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరి బాగోతాన్ని వీడియో చూపించింది. ఇద్దరు పోలీసులు నడి మీద కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పోలీసులపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. యానిమల్’ సినిమా ఫైట్ చూసినట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు.
నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు కొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా రోళ్ల మండలం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద జరిగింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు ఖాకీలు యూనిఫామ్లోనే కొట్టుకున్నారు. వాహనాల తనిఖీల కోసం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం రోళ్ల, అగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణ స్వామి నాయక్, శివకుమార్ను ఉన్నతాధికారులు నియమించారు. అయితే తనిఖీలు చేస్తుండగా ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కానిస్టేబుళ్లు ఒక్కసారి రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
Also read
- అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!
- Bengaluru: రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన సూట్కేస్.. తెరిచి చూడగా కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన స్థానికులు!
- Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?
- Andhra: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బట్టబయలైన యువతీయువకులు బాగోతం
- Telangana: ఇది ప్రజెంట్ సొసైటీ.. అప్పు తీర్చలేదని సొంత చెల్లె ఇంటికి తాళం వేసిన అన్న..