హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెసైక్లబ్లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యో గం నిమిత్తం చెన్నై వెళ్లగా సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది.
తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. 2 ఏళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకు న్నాడని బాధితురాలు తెలిపింది. ఆర్నెళ్లుగా వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. సాయికిరణ్ను అరెస్టుచేసి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





