చింతలమానెపల్లి: బ్యాటరీ ఛార్జర్తో ఆడుతుండగా.. అది ఒక్కసారి పేలడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేశ్-సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన లోకేశ్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం వర్షం కారణంగా బడికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఓ బ్యాటరీ ఛార్జర్ (9వోల్ట్)కు తీగలను అమర్చి వాటిని నోటిలో పెట్టుకున్నాడు. దీంతో ఆ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో లోకేశ్ మొహం మొత్తం తునాతునకలైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకు ఆడుకుంటూ.. కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





