మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.
యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచారయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతడిని పడమటలోని ఆస్పత్రికి తరలించారు.
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





