శ్రీశైలం : శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో అశోక్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఆదివారం తెల్లవారు జామున చెత్త పేపర్లు సేకరించే వ్యక్తులు చూసి 108కి ఫోన్ చేయగా వాళ్ళు స్థానిక పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి హుటాహుటిన 108లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అశోక్ని హత్య చేసిన ఇద్దరు నిందితులను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తి హత్య ఘటనతో శ్రీశైలంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





