శ్రీశైలం : శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో అశోక్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఆదివారం తెల్లవారు జామున చెత్త పేపర్లు సేకరించే వ్యక్తులు చూసి 108కి ఫోన్ చేయగా వాళ్ళు స్థానిక పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి హుటాహుటిన 108లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అశోక్ని హత్య చేసిన ఇద్దరు నిందితులను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తి హత్య ఘటనతో శ్రీశైలంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025