బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం..
ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Also read
- బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
- పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా
- హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్ త్రివేణి..
- Andhra: అరేయ్ ఏంట్రా ఇది.. ఐపీఎల్ సీజన్ అని.. ఇంట్లోనే దర్జాగా డెన్ పెట్టారు.. కట్ చేస్తే..
- Meals in a day: మూడు పూటలా
భోజనం చేయాలన్నది కచ్చితంగా పాటించాల్సిన నియమమా?





