కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి
AP News: కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామ చిలుక దహనంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామ చిలుక దహణంపై శ్రీశైలం దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హిందూ సమాజానికీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని హైందవ సంఘాల నేత రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పండితులు, వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





