ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పు నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం.
AP Crime : ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పు నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం.కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ డబ్బులతో పాటు గ్రామంలో మరిన్ని అప్పులు చేయడంతో భారం పెరిగింది. ఆ భారం భరించలేక భార్యపిల్లలను వదిలేసి తిమ్మరాయప్ప గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భార్య శిరీష తన పుట్టి్ల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటోంది. బెంగళూరులో కూలిపనులు చేసుకుంటూ తన కొడుకును పోషించుకుంటోంది.
ఇదిలా ఉండగా సోమవారం శిరీష తన కుమారుడితో కలసి నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చింది, ఈ విషయం తెలిసిన మునికన్నప్ప, ఆయన భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి శిరీషను అడ్డుకున్నారు. ఆమె భర్త తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. శిరీష కొడుకు ఏడ్చిన కూడా వారి మనసు కరగలేదు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని శిరీషను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో గంటన్నర వ్యవధిలోనే ముని కన్నప్పతో పాటు అతని భార్య మునెమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి కుప్పం పోలీసుస్టేషన్కు తరలించారు. వారిపై BNS 341/323/324/506/34/ IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు సీరియస్
కాగా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన సీఎం. నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని వివరించిన జిల్లా ఎస్పీ. వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని చంద్రబాబు ఆదేశించారు.బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also read
- Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..
- AP Crime : అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి….చంద్రబాబు సీరియస్
- నేటి జాతకములు 17 జూన్, 2025
- పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
- Telangana: గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసె వేసిన రోజు కూలీ – ఆవేదనలో అర్థం ఉందండోయ్