ఏ తల్లికి భారమో.. లేక మరే తల్లి కర్కశత్వమో గానీ.. లోకం చూడకముందే ఆ శిశువు ఊపిరి వదిలింది. బాహ్య ప్రపంచంలోకి రాగానే తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు.. చెత్తకుప్ప పాలయింది. ఈ అమానుష ఘటన చూసి అందరూ గుండెలు పట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
ఏ తల్లికి భారమో.. లేక మరే తల్లి కర్కశత్వమో గానీ.. లోకం చూడకముందే ఆ శిశువు ఊపిరి వదిలింది. బాహ్య ప్రపంచంలోకి రాగానే తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు.. చెత్తకుప్ప పాలయింది. ఈ అమానుష ఘటన చూసి అందరూ గుండెలు పట్టుకున్నారు.
అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగల్లు చెత్తకుప్పలో పసికందు మృతదేహం కనిపించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న అధికారులు.. మృత శిశువును స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
నక్కపల్లి మండలం చిన దొడ్డిగల్లులో దారుణం.. సభ్య సమాజం తలదించుకునే విధంగా నెలల పసికందు చెత్తకుప్పలో కనిపించింది. హరిజనకాలనీ సమీపంలోని తుప్పల్లో సాయంత్రం ఓ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అటుగా వస్తున్న మేకల కాపరి చెత్త కుప్ప చుట్టూ కుక్కలు చేరి హడావుడి చేస్తుండటం గమనించాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి ఆ చెత్తకుప్పలో శిశువు మృతదేహం ఉండటంతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆ పసికందు కు 5-6 నెలల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. అబార్షన్ ద్వారా బయటపడిన ఈ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో విడిచి పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. మృత శిశువును పోస్టుమార్టం కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?