అనంతపురం జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో ఓ యువతి(22)ని అత్యంత దారుణంగా హతమార్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం(సెప్టెంబర్ 7) వెలుగులోకి వచ్చింది. అటు వైపు వెళ్లిన గొర్రెల కాపరులు యువతి మృతదేహాన్ని చూసి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన యువతి ఎవరు, ఎందుకు హత్య చేశారు..? నిందితులు ఎవరనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా , ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు చదవండి
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే