బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ ఢిల్లీలో మోదీకి మద్దతిచ్చే పార్టీలే అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలోని నేతలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. ఇప్పుడు మాత్రం ఇక్కడి నేతలు ఢిల్లీలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోదీని ప్రశ్నించే వారే లేరన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేవారే ఆయన నిజమైన వారసులు అన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా షర్మిల సీఎం అవుతారని చెప్పారు
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





