బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ ఢిల్లీలో మోదీకి మద్దతిచ్చే పార్టీలే అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలోని నేతలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. ఇప్పుడు మాత్రం ఇక్కడి నేతలు ఢిల్లీలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోదీని ప్రశ్నించే వారే లేరన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేవారే ఆయన నిజమైన వారసులు అన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా షర్మిల సీఎం అవుతారని చెప్పారు
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి