SGSTV NEWS
Andhra PradeshCrime

భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..

తన జీవిత భాగస్వామితో స్నేహితుడు క్లోజ్‌గా ఉండటాన్ని సహించలేకపోయాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. రెండు రోజుల పాటు నేరుగా ఇంటికే వెళ్లాడు. చివరికి కుటుంబ సభ్యులు చూస్తుండగానే కసిదీరా పొడిచేశాడు. అడ్డుకోబోయిన స్నేహితుడు కూతురుపై కూడా కత్తి దూశాడు. దీంతో స్థానికులు దేహశుద్ది చేయడంతో అక్కడ నుండి పారిపోయాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్త రెడ్డి పాలెంకు చెందిన మీరా వలి.. సుద్దపల్లి డొంకు చెందిన గోపి ఇద్దరూ స్నేహితులు.. కలిసి తాపిమేస్త్రిలుగా పనిచేస్తున్నారు. మీరావలి వద్దకు కొన్నేళ్ల క్రితం గోపి వచ్చాడు. అప్పటి నుండి పని నేర్పించడమే కాకుండా తాను చేస్తున్న భవన నిర్మాణంలోనే మేస్త్రిగా అవకాశం ఇచ్చాడు. దీంతో ఇద్దిరి స్నేహం మరింత బలపడింది. అయితే ప్రస్తుతం మీరావలి కొత్త రెడ్డి పాలెంలోనే భవన నిర్మాణం చేస్తున్నాడు. గోపి మేస్త్రిగా ఆ పనికి ప్రతిరోజు వస్తున్నాడు.


ఈ క్రమంలోనే గోపి మీరావలి ఇంటికి వచ్చి పోతున్నాడు. గోపి మొదట్లో ఇంటికి వచ్చి పోతున్నా పట్టించుకోని మీరావలి.. కొద్ది కాలం తర్వాత గోపిపై అనుమానం మొదలైంది. తన భార్యతో చనువుగా ఉన్నట్లు గ్రహించాడు. అప్పటి నుండి గోపిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. దీంతో రెండు రోజుల నుండి గోపి కోసం సుద్దపల్లి వచ్చి వెలుతున్నాడు. గోపి కోసం మీరావలి గతంలో కూడా ఇంచికి వచ్చి వెళ్లేవాడు. ఆ విధంగానే మీరావలి వస్తున్నట్లు గోపి కుటుంబ సభ్యులు భావించారు. గోపి కోసం మీరావలి రావడం, గోపి లేకపోవడంతో వెళ్లిపోవడం జరుగుతుంది.



అయితే సోమవారం సాయంత్రం మీరావలి వచ్చిన సమయంలో అదే బజార్ లో గోపి కనిపించాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో మీరావలి దాడి చేసి విచక్షణారహితంగా పొడిచేశాడు. అక్కడే సమీపం నుండి ఇదంతా చూస్తున్న గోపి కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేయబోయాడు. వెంటనే స్థానికులు స్పందించి మీరావలికి దేహశుద్ది చేశారు. దీంతో అక్కడ నుండి సమీప గుట్టలోకి పారిపోయి దాక్కున్నాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి మీరావలిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share this