SGSTV NEWS
Andhra PradeshCrime

స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన వృద్ధురాలు.. ఒక్కసారిగా గీజర్ నుంచి మంటలు..!

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండ పట్టణం శిరిడి సాయి నగర్‌లో గ్యాస్ గీజర్‌లో మంటలు వ్యాపించి వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. స్నాం చేయడానికి బాత్‌రూంలోకి వెళ్లిన వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఉరవకొండ పట్టణంలోని శిరిడి సాయి నగర్ లో నివాసం ఉంటున్న నారాయణమ్మ అనే వృద్ధురాలు బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లింది. అయితే గ్యాస్ గీజర్ ను ఆన్ చేయగా ప్రమాదవశాత్తు అందులో నుంచి మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడింది. మంటలు చెలరేగి ఒక్కసారిగా వృద్ధురాలి ఒంటికి మంటలు అంటుకున్నాయి. కింద పడిపోయిన వృద్ధురాలు నారాయణమ్మను మంటల నుంచి కాపాడే ప్రయత్నం చేసింది ఇంట్లోని పనిమనిషి.

చివరికి ఇరుగుపొరుగు వారి సాయంతో తీవ్రంగా గాయపడిన నారాయణమ్మను మొదట ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా నారాయణమ్మ మార్గ మధ్యలోనే మృతి చెందింది. నారాయణమ్మ కూతురు విదేశాలలో ఉండగా, కొడుకు మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. దీంతో ఉరవకొండ పట్టణం శిరిడి సాయి నగర్ లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు నారాయణమ్మ ఇలా అగ్నికి అహుతి అయ్యింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this