తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జెడీ లక్ష్మి నారాయణ సీబిఐ జాయింట్ డైరెక్టర్గా పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసారు. సత్యం రామలింగరాజు కేసు నుంచి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం, ముఖ్యమంత్రి పై సీబీఐ, ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేయడంతో లక్ష్మి నారాయణ తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు సంపాధించుకున్నారు. అనంతరం యూపీ కేడర్ ఐపిఎస్కు రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ 2019లో రాజకీయ ప్రవేశం చేసి జనసేన నుంచి విశాఖ లోక్ సభకు పోటీ చేసి 2 లక్షల 88 వేలు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలబడ్డారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి తాజాగా జైభారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల పనేనా?
అయితే విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025