SGSTV NEWS
CrimeTelangana

Anchor Swetcha: నా భర్త అమాయకుడు, స్వేచ్ఛ బ్లాక్ మెయిల్ చేసింది: పూర్ణచందర్‌ భార్య సంచలన కామెంట్స్!


పూర్ణ చందర్, స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధం తనకి తెలియదని స్వప్న తెలిపింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని వెల్లడించింది. తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది.

యాంకర్ స్వేచ్ఛ కేసులో రోజురోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పూర్ణచందర్‌‌తో కొన్ని రోజుల నుంచి రిలేషన్‌లో ఉండగా వివాహానికి నిరాకరించడంతో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూర్ణచందర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. అయితే పూర్ణ చందర్ భార్య స్వప్న సంచలన కామెంట్స్ చేసింది. తనకు పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ పరిచయం అయ్యిందని స్వప్న తెలిపింది.

మానసికంగా టార్చర్ చేసిందని..
వారిద్దరి మధ్య ఉన్న సంబంధం తనకు తెలియదని, తెలిసిన తర్వాత పూర్ణను వదిలేసినట్లు పేర్కొంది. స్వేచ్ఛ కూతురు అరణ్య పూర్ణచందర్‌పై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, తనని సొంత కూతురులా చూసుకున్నాడని స్వప్న తెలిపింది. స్వే్చ్ఛ తనని మానసికంగా టార్చర్ చేసిందని, పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని వెల్లడించింది. తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని, తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది

ఇదిలా ఉండగా పూర్ణచందర్ వేధింపుల వ‌ల్లే స్వేచ్ఛ ఆత్మహ‌త్య కు పాల్పడినట్లు ఇటీవల పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచార‌ణ‌లో సైతం పూర్ణచంద‌ర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా స్వేచ్ఛతో కలిసి ఉంటున్న పూర్ణ పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేసిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకో అని పూర్ణచందర్ స్వేచ్ఛకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.అతను చేసిన మోసాన్ని గ్రహించిన స్వేచ్చ అత‌డి నుండి విడిపోదామ‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణచంద‌ర్ గొడ‌వ‌ప‌డిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read

Related posts

Share this