ఆదోని : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దాన్ని వాడుతున్న కొందరు అజ్ఞానముతోనే ఉన్నారని ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాలనీలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని శంకర్ నగర్ కాలనీకి చెందిన రాఘవేంద్ర (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సొంత ఊరైన ఆదోనిలో నిర్వహించాలని బంధువులు గత రాత్రి ఆదోనిలోనే శంకర్ నగర్ కు చేరుకున్నారు. ఎక్కడో చనిపోయి పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాన్ని అనుమతి ఇచ్చేది లేదని వాహనాన్ని కాలనీవాసులు అడ్డుకున్నన్నారు. మృతుడు రాఘవేంద్ర 15 సంవత్సరాల క్రితం ఆదోని నుండి బతుకుతెరువు కోసం తాడిపత్రిలో జీవనం సాగిస్తున్నారు. మృతుడు రాఘవేంద్ర అనంతపురంలోని ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి నుండి అనంతపురంకు వెళ్తుండగా శనివారం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసుకొని సొంత ఊరు అయినా ఆదోనికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. శంకర్ నగర్ కాలనీలో పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని తీసుకురాకూడదని కాలనీవాసులు అడ్డుపడడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సొంత ఇంటికి మృతదేహాన్ని అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని మృతుడి బంధువులు ఆగ్రహించారు. ఎంత బ్రతిమాలాడిన కనికరం చూపలేదని దుమ్మెత్తి పోశారు. చివరకు చేసేదేమీ లేక మండగిరిలోనే బంధువులు ఇంటికి తరలించి అక్కడి నుండి స్మశాన వాటికలో ఖననం చేశామని తెలిపారు. మృతిదేహాన్ని అడ్డుకున్న వారిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని బంధువులు తెలిపారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!