అమరావతి: విశాఖపట్నంలోని ఎన్ఎడి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పోలీసులకు యువకుడికి మద్య మాటామాటా పెరింగింది. దీంతో ఆ పోలీసు చొక్కాను యువకుడు పట్టుకున్నాడు. తన కాలర్ పట్టుకోవడంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుడిని కొట్టాడు. దీనితో రెచ్చిపోయిన యువకుడు తిరిగి ట్రాఫిక్ కానిస్టేబుల్ను కొట్టాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కానిస్టేబుల్పై చేయి చేసుకున్నందుకు యువకుడిపై కేసు నమోదు చేశారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024