తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి గాయపడింది. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో మూడేళ్లగా నర్సుగా విధులు నిర్వహిస్తోంది. హాస్టల్లో ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్కు చేరుకుంది. ఈ క్రమంలో యువతితో మాట్లాడేందుకు విజయవాడ నున్నకు చెందిన క్రాంతి యత్నించాడు. తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో క్రాంతి తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో క్రాంతిని నెట్టే క్రమంలో కావ్య చేతిపైన గాయాలయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్రాంతిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే