యశవంతపుర: నగల షాపు యజమాని ఇంట్లో పనిచేస్తూ రూ.15.15 కోట్ల విలువగల బంగారాన్ని దోచుకెళ్లిన నేపాలీ జంట ఆచూకీ లేదు. కొన్ని నెలల కిందట సురేంద్రకుమార్ జైన్ ఇంటిలో నేపాల్కు చెందిన నేమిరాజ్ దంపతులు పనిచేస్తూ నమ్మకంగా ఉండేవారు. నవంబర్ 1న జైన్ కుటుంబం గుజరాత్లో ఇంటి పండగుక వెళ్లినప్పుడు నేమిరాజ్ దంపతులు డబ్బు బంగారంతో ఉడాయించారు. అప్పటినుంచి పోలీసులు గాలిస్తున్నా జాడ లేదు. నేపాలు పారిపోయి దాక్కున్నట్లు అనుమానం. బెంగళూరు పోలీసులకు కష్టతరంగా మారడంతో ఇంటర్ పోలు సమాచారమిచ్చారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని అభ్యర్థించారు.
Also read
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య





