కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో విషాదం చోటు చేసుకుంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత (26) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగారం వెస్ట్ గాంధీనగర్లో ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీక్షిత బెంగళూరులోని ఓ కళాశాలలో పీజీ ఆప్తమాలజీ మొదటి సంవత్సరం చదువుతోంది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





