వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో జరిగింది. ఓ మహిళతో ఉన్న సాన్నిహిత్యం వల్ల విజయ్ అనే యువకుడికి, మైనర్ బాలుడికి మధ్య రగడ జరిగింది. విజయ్ తల్లి మైనర్ బాలుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన విజయ్ తో బాలుడికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో విజయ్ పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే విజయ్ ను రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు
Also read
- నేటి జాతకమలు..18 ఫిబ్రవరి, 2026
- పవిత్ర ఫాల్గుణ మాసం.. ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయో తెలుసుకోండి
- ఫాల్గుణం.. విష్ణు పూజలకు ప్రత్యేకం.. ఈ మాసంలో వచ్చే పండగలు ఇవే
- అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం.. ఊహించని ప్రమాదంతో..
- Viral: అక్కా.! నీకో దండం.. భర్తను అమ్మేసిన భార్య.. కారణం తెలిస్తే బిత్తరపోతారు





