వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో జరిగింది. ఓ మహిళతో ఉన్న సాన్నిహిత్యం వల్ల విజయ్ అనే యువకుడికి, మైనర్ బాలుడికి మధ్య రగడ జరిగింది. విజయ్ తల్లి మైనర్ బాలుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన విజయ్ తో బాలుడికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో విజయ్ పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే విజయ్ ను రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు
Also read
- నేటి జాతకములు…23 మే, 2025
- Garuda Puran: గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న జీవికి వేసే శిక్షలు తెలిస్తే.. సూసైడ్ అన్న మాటే తలవరు
- శుభకార్యం ఆనందం తీరకముందే అంతులేని విషాదం.. ఒకరిని రక్షించబోయి మరొకరు..
- జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం
- Andhra: ఫుల్లుగా తాగి.. ఛీ ఛీ ఏంట్రా ఇది..! ఆటోకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి…..