పల్నాడు : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన ఫాస్టర్లు రావెల వెంకటేశ్వర్లు (75) మొండితోక బాలశౌరి(53), రొంపిచర్ల మండలం తురుమెళ్ళ గ్రామంలో గల చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఒంగోలు నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ వేగం తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బాలశౌరి లారీ కింద పడి అక్కడక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన రావెల వెంకటేశ్వర్లును నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారు అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కెపి.రవీంద్రబాబు తెలిపారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!






సీఎం చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటా, అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు