పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : వెయ్యి రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారితీసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలపిన వివరాల మేరకు… ఎరుకొండకు చెందిన గొర్రెల నవీన్ (21), బొంతు అప్పలనాయుడు స్నేహితులు. ఇద్దరూ కార్మికులు. ఆదివారం గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేసి, పని పూర్తయ్యాక సాయంత్రం ఇద్దరూ కలిసి పూటుగా మద్యం తాగారు. రాత్రి పది గంటల సమయంలో స్నేహితుల మధ్య రూ.వెయ్యి డబ్బుల కోసం ఘర్షణ మొదలైంది. ఘర్షణ అనంతరం తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న నవీన్పై బైక్పై వచ్చిన అప్పలనాయుడు వెనుక నుంచి నవీన్పై పడ్డాడు. నవీన్ ఇంటి ముందే ఇద్దరూ ఘర్షణపడ్డారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ ఛాతిపై, కడుపులో అప్పలనాయుడు పొడిచాడు. బయట ఘర్షణ జరుగుతుండడంతో ఇంట్లో నుంచి నవీన్ తల్లి వచ్చి చూడగా ఆమె చేతిలో కుమారుడు ప్రాణం విడిచాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సిహెచ్సి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.
Also Read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





