హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వాక్ వేలో ఓ మహిళను వెంబడించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 1లో నివసించే యువతి (33) ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్కు లోపల తన తల్లితో కలిసి వాకింగ్ కోసం వచ్చారు. పార్కు లోపల వాకింగ్ చేస్తుండగా ఆమెను అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు వెంబడించాడు.
అనుమానించిన యువతి నెమ్మదిగా తన సెల్ ఫోన్లో వీడియో తీసింది. అదే సమయంలో షీ టీమ్స్కు చెందిన ఒకరు వాకింగ్కు వచ్చి ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే షీ టీంకు సమాచారం అందించారు. యువతి పార్కు వద్ద ఉన్న సెక్యూరిటీకి సమాచారం ఇవ్వడంతో ఆగంతకుడిని పట్టుకున్నారు. అతన్ని విచారించగా కోల్కతాకు చెందిన అబ్దుల్ రహమాన్ (28)గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 14లోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. అదే సమయంలో పార్క్ వద్దకు షీ టీం, బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Puranam: భర్తలు జాగ్రత్త.. మీ భార్యని ఇలా బాధపెడుతున్నారా.. గరుడ పురాణం ప్రకారం ఏఏ శిక్షలో తెలుసా..
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- తెలంగాణ: కాళ్ళ పారాణింకా ఆరనే లేదు.. 22 రోజులకే నవ వధువు మృతి!
- డెలివరీ అయిన మూడు రోజులకే వారి ఫ్రెండ్స్తో పడుకోమన్నాడు.. టెక్ బిలియనీర్ భార్య సంచలనం!
- జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్తో కొట్టి కొట్టి….