హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వాక్ వేలో ఓ మహిళను వెంబడించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 1లో నివసించే యువతి (33) ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్కు లోపల తన తల్లితో కలిసి వాకింగ్ కోసం వచ్చారు. పార్కు లోపల వాకింగ్ చేస్తుండగా ఆమెను అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు వెంబడించాడు.
అనుమానించిన యువతి నెమ్మదిగా తన సెల్ ఫోన్లో వీడియో తీసింది. అదే సమయంలో షీ టీమ్స్కు చెందిన ఒకరు వాకింగ్కు వచ్చి ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే షీ టీంకు సమాచారం అందించారు. యువతి పార్కు వద్ద ఉన్న సెక్యూరిటీకి సమాచారం ఇవ్వడంతో ఆగంతకుడిని పట్టుకున్నారు. అతన్ని విచారించగా కోల్కతాకు చెందిన అబ్దుల్ రహమాన్ (28)గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 14లోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. అదే సమయంలో పార్క్ వద్దకు షీ టీం, బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!