పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.
చంద్రగిరి : పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణిగుంట మండలం ఆర్. మల్లవరం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్(31) దుర్మరణం చెందాడు. యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుటుంబ సభ్యుల కోరిక అక్కడ మానేసి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపులున్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఈ అమావాస్యనాడు ఈ రాశుల వారిపై ప్రభావం? జాగ్రత్త పడకపోతే దరిద్ర దేవతను నెత్తిన పెట్టుకున్నట్టే
- శుక్రవారం పవర్ఫుల్ అమావాస్య.. ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
- చనిపోయిన వారి నోటిలో బంగారం ఎందుకు పెడతారో తెలుసా? ఎవ్వరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యం..
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!





