పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.
చంద్రగిరి : పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణిగుంట మండలం ఆర్. మల్లవరం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్(31) దుర్మరణం చెందాడు. యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుటుంబ సభ్యుల కోరిక అక్కడ మానేసి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపులున్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పిన భారత ఆర్మీ.. ఇక నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
- AP Crime : నకిలీ ఏసీబీ అధికారి కేసులో బిగ్ట్విస్ట్.. తెరవెనుక కిలాడీ సీఐ
- అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
- Hyderabad: దారుణ ఘటన.. 32 అంతస్తుల భవనం పైనుంచి దూకిన సాఫ్ట్వేర్ టెకీ! జాబ్ ఎంతపని చేసింది..
- Donald Trump : భారత్ – పాక్ యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన