దారుణం చోటుచేసుకుంది.. ముక్కుపచ్చలారని చిన్నారి ఉసురు తీసింది.. ఓ పెంపుడు కుక్క. ఒక్కసారిగా ఐదు నెలల పసివాడిపై దాడిచేసిన కుక్క.. పీక్కుతింది. ఒక్కసారిగా బాబుపై దాడి చేసి ముఖాన్ని కొరికి కొరికి చంపేసింది. ఈ దారుణం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. తాండూరు బసవేశ్వర్ నగర్లో నివసిస్తున్న దత్తు-లావణ్య దంపతులకు ఐదు నెలల బాబు ఉన్నాడు. వీళ్లు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుంది ఆ కుక్క చిన్నోడిపై విరుచుకుపడింది. ముఖంపై రక్తంకారేలా దారుణంగా కొరికేసింది. పెంపుడు కుక్క దాడిలో ఆ పసివాడు తల్లడిల్లాడు. ఇంతలో కేకలు విని తల్లిదండ్రులు హుటాహుటిన పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విగతజీవిగా మారిన పసివాడిని చూసి గుండెలుపలిగేలా రోదించారు తల్లిదండ్రులు.
ఇంటికి కాపలా ఉంటుందని పెంచుకున్న కుక్క.. చిన్నోడిని పొట్టనపెట్టుకోవడంతో బంధువులు, స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ శునకాన్ని కొట్టికొట్టి చంపేశారు.
తాము కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని కుక్క ప్రాణాలు తీయడంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!
- చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్లో బాలిక మృతికి కారకులెవరు..?
- చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..





