అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు
అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు తనవరపు కుమార్, అరెల్లి పవన్గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు