జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది.

చింతకొమ్మదిన్నె,: జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని శెట్టిపల్లెకి చెందిన కొండయ్య(65) కొన్నేళ్ల కిందట భార్య మల్లేశ్వరి, కుమారుడితో కలిసి కడప నగరంలోని నాగరాజుపేటకు వలస వచ్చారు. కొండయ్య మద్యానికి బానిసై 3 నెలల కిందట ఇంటినుంచి వెళ్లిపోయి.. పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి మూలవంకకు వచ్చి ఓ దర్గా వద్ద పడుకున్నారు. అప్పటికే అతను మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి ‘జే బ్రాండ్ మద్యం తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నకిలీ మద్యానికి బానిసై తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారని మృతుని భార్య మల్లేశ్వరి విలపించారు. ఈ విషయమై గ్రామీణ సీఐ శంకరానాయక్ను వివరణకోరగా.. దీనిపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!