జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది.

చింతకొమ్మదిన్నె,: జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని శెట్టిపల్లెకి చెందిన కొండయ్య(65) కొన్నేళ్ల కిందట భార్య మల్లేశ్వరి, కుమారుడితో కలిసి కడప నగరంలోని నాగరాజుపేటకు వలస వచ్చారు. కొండయ్య మద్యానికి బానిసై 3 నెలల కిందట ఇంటినుంచి వెళ్లిపోయి.. పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి మూలవంకకు వచ్చి ఓ దర్గా వద్ద పడుకున్నారు. అప్పటికే అతను మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి ‘జే బ్రాండ్ మద్యం తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నకిలీ మద్యానికి బానిసై తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారని మృతుని భార్య మల్లేశ్వరి విలపించారు. ఈ విషయమై గ్రామీణ సీఐ శంకరానాయక్ను వివరణకోరగా.. దీనిపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
Also read
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?
- మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!





