ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ. లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్ వి టీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు.
జీడిమెట్ల: ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ. లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల అయోధ్యనగర్కు చెందిన వంశీకృష్ణగౌడ్ లిఫ్ట్ టెక్నీషియన్గా పనిచేసేవాడు. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా మధ్యప్రదేశ్కు చెందిన విశాల్యాదవ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన వద్ద ఆయుధాలు ఉన్నాయని, విక్రయిస్తానని విశాల్యాదవ్ చెప్పాడు. హైదరాబాద్లో డిమాండ్
ఉంటుందని చెప్పడంతో తనకు ఓ పిస్తోల్ కావాలని వంశీకృష్ణగౌడ్ అడిగాడు. అందుకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నారు. తొలుత ఫోన్ పే ద్వారా రూ.19 వేలు చెల్లించాడు. మార్చి 6న ఖాజీపేట రైల్వేస్టేషన్ వద్దకు పిస్తోల్ తీసుకొచ్చినట్లు అతను చెప్పాడు.
వంశీకృష్ణగౌడ్ బైక్ పై అక్కడికెళ్లి మిగతా డబ్బు ఇచ్చి పిస్తోల్ తీసుకొని అయోధ్యనగర్ కు వచ్చాడు. ఎవరు కొనుగోలు చేస్తారని ఆరా తీయడం మొదలుపెట్టాడు. బుధవారం సాయంత్రం అయోధ్యనగర్ నుంచి వెళ్తుండ చింతల్లో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఆపారు. సోదా చేయగా బైక్ లో పిస్తోల్ కనిపించింది.దాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
- ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
- ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
- సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్





