సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
కోదాడ గ్రామీణం: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నగదు ఉన్న పెట్టె ఓపెన్ కాకపోవడంతో ఆశ వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అందులోని నగదు కాలిపోయింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసిన తర్వాత విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గ్రామీణ ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





