సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
కోదాడ గ్రామీణం: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నగదు ఉన్న పెట్టె ఓపెన్ కాకపోవడంతో ఆశ వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అందులోని నగదు కాలిపోయింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసిన తర్వాత విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గ్రామీణ ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!