అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు
671 మార్కులతో పాసయ్యాడు
మృత్యువుతో పోరాడి అలసిపోయాడు
హైదరాబాద్: అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు.. భవిష్యత్తు బాగుండాలని అందరిలానే కలలు కన్నాడు.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పస్ట్క్లాస్ మార్కులతో పాసయ్యాడు.. కానీ తన రిజల్ట్స్ చూసుకోకుండానే విధి వక్రీకరించడంతో సదరు బాలుడు మృతిచెందాడు.. వివరాల్లోకెళితే గాజులరామారం డివిజన్ రోడామేస్త్రీనగర్కు చెందిన మీర్జా నయీమ్బేగ్, అస్రాబేగంలకు కుమారుడు మీర్జా హంజాబేగ్(17) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అయినా పట్టుదలతో చదివి 10వ తరగతి పరీక్షల్లో పస్ట్క్లాస్లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమ్మని తల్లిదండ్రులు కోరినా చదవాలనే కోరికతో ఐడీపీఎల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్నాడు. మార్చి 2024లో అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అస్పత్రిలో చేరిన హంజాబేగ్ చికిత్స పొందుతూ మార్చి 27న మృతి చెందాడు. బుధ వారం ఇంటర్ ఫలితాలు చూసిన తల్లిదండ్రు లు తమ కుమారుడు 671మార్కులతో పాసయ్యాడని తెలుసుకుని బోరున విలపించారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!