మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో సంకల్ప పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. అలంకార మండపంలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంద మూర్తి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి తదితర ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.
Also read
- 100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!
- పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, వివాహ యోగం ఖాయం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Andhra: హీరోగా సగం సినిమా కూడా కంప్లీట్.. ఆ ఒక్క ఘటనతో చివరకు ఇలా..
- New Scam: ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు.. జాగ్రత్త..!





