మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు,, భక్తుల శివనామ స్మరణల మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నారద పుష్కరిణి అలలపై ఉత్సవ మూర్తులు ఐదు ప్రదక్షిణల అనంతరం ధూప ,దీప, నైవేద్య కైంకర్యాలు చేపట్టారు. తెప్పోత్సవం తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలివచ్చారు
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





