ఒంగోలు::
ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమం నిర్వాహకులు బ్రహ్మచారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు వివరాలు తెలుచూ… 24వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, తోడై మంగళం, జయదేవ అష్టపదులు, పంచపది, దివ్య నామం, దీప ప్రదక్షిణ మరియు డోలోత్సవం జరుగునని, 25వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉంచ వృత్తి, తదుపరి శ్రీ రాధా మాధవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ లోకనాధుని కళ్యాణానికి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు.
Also read
- ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
- Hyderabad: ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
- అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
- `అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’
- బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!





