పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల మాయమైంది. శాశ్వత అర్చకులకు అసిస్టెంట్ అయిన, పెదకాకాని పాతూరుకు చెందిన కొండవీటి రణధీరన్ను ఈ కేసులో పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. అర్చకుల ఇళ్లలో సోదాలు చేయగా, రణధీర్ ఇంట్లో వస్తువును గుర్తించారు.
పోలీసులు ప్రశ్నించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ నారాయణస్వామి విలేకర్లకు తెలిపారు.
శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల దర్శనార్థం రెండు రోజులపాటు ఈ అలంకరణనే కొనసాగించారు. అమ్మవారి మంగళసూత్రం మాయమైనట్లు అర్చకులు 18న గుర్తించారు. ఈ మేరకు ఆలయ ఈవో గోగినేని లీలాకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
Also Read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





