ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ లాంగ్టర్మ్ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి.
అయితే నీట్ పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్ఎఫ్ఎ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఎ నేతలు డిమాండ్ చేశారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




