చింతలమానెపల్లి: బ్యాటరీ ఛార్జర్తో ఆడుతుండగా.. అది ఒక్కసారి పేలడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేశ్-సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన లోకేశ్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం వర్షం కారణంగా బడికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఓ బ్యాటరీ ఛార్జర్ (9వోల్ట్)కు తీగలను అమర్చి వాటిని నోటిలో పెట్టుకున్నాడు. దీంతో ఆ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో లోకేశ్ మొహం మొత్తం తునాతునకలైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకు ఆడుకుంటూ.. కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Also read
- ఈడ్చుకెళ్లి… గొంతుకోసి..అత్తపై కోడలు హత్యాయత్నం
- బ్యాటరీ ఛార్జర్.. బాలుడి ప్రాణం తీసింది
- నేటి జాతకములు 23 జూలై, 2026
- varahi ammavaru: వారాహి అమ్మవారి పుట్టుక గురించి తెలుసా..? అసలు ఆమెకున్న శక్తులేంటో తెలుసా..?
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే





