చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు సిద్ధార్థకు ఈత నేర్పించేందుకు వెళ్లిన తల్లి రేవతి, ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి కుమారుడితో పాటు ప్రాణాలు కోల్పోయింది. పంట పొలంలోని 10 అడుగుల లోతున్న తార్పాలిన్ ఫార్మ్ పండ్లో తాడు కట్టి ఈత నేర్పిస్తుండగా తాడు జారిపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
చిత్తూరు జిల్లాలో కొడుకుకు ఈత నేర్పాలనుకున్న ఒక తల్లి ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. కొడుకు తోపాటు ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకునేందుకు కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో ఉపాధి హామీ ఫారం ఫండ్ నీటి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. నెలవాయి గ్రామానికి చెందిన తల్లి రేవతి, కొడుకు సిద్ధార్థ మృతి చెందారు. రఘుపతి నాయుడు పంట పొలంలోని 10 అడుగుల లోతుగల తార్ పాలిన్ ఫారం ఫండ్ లో ఆదివారం కొడుకు సిద్ధార్థ కు ఈత నేర్పించేందుకు తల్లి రేవతి తీసుకెళ్ళింది.
తాడు కట్టి ఈత నేర్పిస్తుండగా తాడు జారి పోయింది. దీంతో కొడుకుతో పాటు తల్లి కూడా నీటి కుంటలో పడి పోయింది. బయటకు రాలేక ఇద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కుంటలో నుంచి మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు .. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్ఆర్ పురం పోలీసులు డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లి కొడుకు ఇద్దరూ నీటి కుంటలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఈత కోసం వెళ్లి తల్లీ కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





