హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. యువతులను రూ.కోట్లలో మోసం చేస్తున్న వెంకట కామేష్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసుల దర్యాప్తులో అతని అరాచకాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన వెంకట కామేష్పా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన వారంతా ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్ల సంపన్నుడిగా నమ్మించి యువతుల నుంచి డబ్బులు వసూలు చేసిన కామేష్.. బెట్టింగ్, గేమింగ్ ఆడుతున్నాడని చెప్పారు. ఫామ్ హౌస్ పని వాళ్లకు డబ్బులు ఇచ్చి యజమానిగా చెప్పుకొనేవాడని తెలిపారు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో కామేష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా.. పీటీ వారెంట్పై మచిలీపట్నం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమని సంప్రదించాలని.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహార్ తెలిపారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





