పాతబస్టాండ్(నారాయణపేట): నారాయణపేట జిల్లా కేంద్రంలో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నారాయణపేట పట్టణానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల కిందట భర్త మృతి చెందారు. పెద్ద కుమార్తె(15) కూలిపని చేస్తోంది. పట్టణంలోని అశోకనగర్కు చెందిన ఫైజల్(20) కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్నాడు. బక్రీద్ సందర్భంగా యువకుడు బాలికతో కలిసి ద్విచక్ర వాహనంపై నారాయణ పేటలో పర్యటించాడు. ఈ విషయం ఫైజల్ కుటుంబీకులకు తెలిసింది. ఆదివారం ఉదయం బాలిక ఇంటికి ఫైజల్ వెళ్లాడు. అక్కడేం జరిగిందో.. యువకుడు ఇంటినుంచి బయటకు వెళ్లగానే బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహంతో బాలిక కుటుంబీకులు, స్థానికులు పాతబస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు.
విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు.మేరకు కేసు నమోదు చేసి నిందితుడు ఫైజల్ను అరెస్టు చేసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





